హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశమున్నట్లు సమాచారం. ఆత్యాచారం, వేధింపులు కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు గోవాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిన్న కోర్టులో ప్రవేశపెట్టగా జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇస్తూ.. తనను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని తెలిపాడు. అటు పోలీసులు మాత్రం రిమాండ్ రిపోర్టులో జానీ మాస్టర్ తప్పును అంగీకరించినట్లు తెలిపారు.