24-04-2025 06:47:58 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బ్రహ్మపురి కాలంకు చెందిన సోఫిబేగ్(25) అనే యువకుడు గురువారం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురై వాంతులు విరేచనాలు చేసుకోవడంతో నిర్మల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందు గురువారం ఉదయం మృతి చెందినట్లు వారు తెలిపారు. గల్ఫ్ దేశానికి వెళ్లి నెల రోజుల క్రితమే సొంత ఇంటికి వచ్చిన ఆయన వడదెబ్బ గురై మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొన్నాయి.