calender_icon.png 9 October, 2024 | 4:57 AM

డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం

04-09-2024 01:20:59 AM

నేటి నుంచి దోస్త్ స్పెషల్ డ్రైవ్ 

హైదరాబాద్, సెప్టెంబర్3(విజయ క్రాంతి): డిగ్రీలో ఇప్పటి వరకు అడ్మిషన్లు తీసుకోని విద్యార్థులకు తెలం గాణ ఉన్నత విద్యామండలి మరో అవకాశాన్ని కల్పించింది. ఇంజినీరింగ్‌లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ డ్రైవ్ కౌన్సిలింగ్‌ను చేపట్టనుంది. ఈమేరకు మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. రూ.400 ఫీజు చెల్లించి ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. అవే తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఈనెల 11న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కళాశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేన  తెలిపారు.