రాజేంద్రనగర్, అక్టోబర్ 4: యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. సైబర్ క్రైమ్లో లైంగిక దాడి బాధితురాలు శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా హర్షసాయి తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని, ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. దీనికి సంబంధించి బాధితురాలు పలు స్క్రీన్షాట్లను పోలీసులకు సమర్పిం చింది.
తనపై హర్షసాయి లైంగిక దాడి చేశాడని, నగ్న చిత్రాలు సేకరించి తన నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశాడని సదరు బాధితురాలు కొన్నిరోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.