calender_icon.png 4 October, 2024 | 4:59 PM

యూట్యూబర్‌ హర్షసాయిపై మరో ఫిర్యాదు

04-10-2024 01:49:31 PM

తనపై ట్రోలింగ్‌ చేయిస్తున్నాడని బాధితురాలి ఆరోపణ 

రాజేంద్రనగర్, విజయక్రాంతి: యూట్యూబర్ హర్ష సాయిపై మరో ఫిర్యాదు పోలీసులకు అందింది. అతడి పై ఫిర్యాదు చేసిన బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది. ట్రోలింగ్‌పై స్ర్కీన్‌ షాట్లను పోలీసులకు బాధితురాలు అందజేసింది. హర్ష సాయి గణపయ్య ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. వచ్చేసాయి తనపై అత్యాచారం చేసి రెండు కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడని ఓ యువతి గతంలో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.