బాధితురాలి ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు
రాజేంద్రనగర్: యూట్యూబర్ హర్ష సాయికి మరో షాక్ తగిలింది. తను ఈ మెయిల్స్ తో వేధిస్తున్నాడని బాధితురాలు మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే హర్ష సాయిపై అత్యాచారం, న్యూడ్ ఫోటోలు, వీడియోలతో బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇప్పటికే అయనపై కేసు నమోదు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, బాధితురాలు తన నుంచి డబ్బులు లాగడానికే ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుందని హర్ష సాయి సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. హర్ష సాయిని పట్టుకునేందుకు నార్సింగ్ పోలీసులు నాలుగు బృందాలతో గాలిస్తున్నారు.