ముగ్గురికి తీవ్రగాయాలు
కొండపాక, సెప్టెంబర్ 11: ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. హై దరాబాద్కు చెందిన మల్లేశం, మహే శ్, పర్వతాలు అనే ముగ్గురు కారులో కొమురవెళ్లి మల్లన్న దర్శనానికి వెళ్తుండగా కొండపాక మండలం మెదిని పూర్ స్టేజీ వద్ద రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మరోకారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యా యి. 108 అంబులెన్స్ సిబ్బం ది ఘట నా స్థలానికి చేరుకొని వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.