calender_icon.png 15 October, 2024 | 3:52 PM

హైదరాబాద్‌లో మరో దారుణం..

15-10-2024 01:02:17 PM

ప్రైవేట్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం

ఆటోలోనే యువతిపై డ్రైవర్ మరో యువకుడి అత్యాచారం..

గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు..

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): హైదరాబాద్‌లో వరుస క్రైమ్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. ఓ ప్రైవేటు ఆర్కిటెక్ కంపెనీ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. గచ్చిబౌలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఆటోలో వెళ్తున్న యువతిపై కన్నేసిన కామాంధులు.. ఆటోలోనే ఆమెపై అత్యాచారాకి ఒడిగట్టారు. ఆటో డ్రైవర్‌తో పాటు.. మరో యువకుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న అర్ధరాత్రి ఆర్‌సీపురం వద్ద ఆటో ఎక్కింది ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతి. ఆ ఆటో అర్ధరాత్రి 2:30 సమయంలో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. అయితే, మసీద్‌ బండ దగ్గరకు ఆటో చేరుకోగానే, తనపై ఆటో డ్రైవర్‌తో పాటు మరో యువకుడు ఆటోలోనే అత్యాచారం చేశారని గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం మసీద్ బండ దగ్గర వదిలి పారిపోయారని ఫిర్యాదులో తెలిపింది. ఇక కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలని పరీక్షల నిమిత్తం కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి పంపినట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్‌లో ఓవైపు అఘాయిత్యాలు, మరోవైపు మర్డర్‌లు వరుసగా వెలుగు చూస్తున్న వేళ మరో ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.