25-04-2025 11:28:36 PM
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయ 27వ వార్షికోత్సవం ఫాదర్ మార్టిన్ పసల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిషప్ జోసఫ్ జయరాజ్ దివ్యబలి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి పలు విచారణ గురువులు, మఠ కన్యలు, విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో శుభోదయం యువజన సంఘ సభ్యులు, చర్చి కమిటీ పెద్దలు, భక్తులు పాల్గొని దేవుని దీవెనలు పొందారు.