calender_icon.png 9 October, 2024 | 6:50 PM

దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం

09-10-2024 04:40:21 PM

హుజూర్ నగర్ (విజయక్రాంతి): హుజూర్ నగర్ పట్టణంలో సీతారామనగర్ రామాలయం వద్ద దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద అమ్మవారి ప్రాంగణంలో సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు ప్రత్యేక పూజలు నిర్వహించి  కమిటీ వారు నిర్వహించిన కుంకుమ పూజ కార్యక్రమం, చండీయాగంలో పాల్గొన్నారు. పూజ కార్యక్రమం అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి తండ్రిగారైన కీ" శే" నలమాధ పురుషోత్తం రెడ్డి పేరు మీద నిర్వహించిన అన్నసంతర్పణకు హాజరై భక్తులకు అన్న ప్రసాదం అందించడం జరిగింది. అమ్మవారి కుంకుమ పూజ, చండీయాగంలో అత్యధిక మంది మహిళ భక్తులు పాల్గొన్నారు. సుమారు 3,500 మంది భక్తులకు అన్న ప్రసాదం స్వీకరించడం జరిగిందని సీతారామ నగర్ దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ తెలియజేసింది.