calender_icon.png 8 October, 2024 | 7:35 PM

అన్న వితరణ చేసిన ఎమ్మెల్యే గంగుల

08-10-2024 04:51:21 PM

కరీంనగర్, (విజయక్రాంతి): నగరంలోని భగత్ నగర్ శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మంటపం వద్ద ప్రత్యేక పూజలు చేసి, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. అదేవిధంగా సంతోష్ నగర్ లోని శ్రీ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసి,  అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఎమ్మెల్యే గంగులను ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల అన్న ప్రసాదాన్ని భక్తులతో కలిసి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర మేయర్ వై సునీల్ రావు, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్, 56వ డివిజన్ కార్పొరేటర్, వంగపల్లి రాజేందర్ రావు,  ఆయా మంటపాల నిర్వాహకులు, భక్తులు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.