లక్షేట్టిపేట (విజయక్రాంతి): తనను నమ్ముకొని కష్ట కాలంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఒకానొక సభలో మాట్లాడిన మాటలను నేడు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) రుజువు చేశారు. శుక్రవారం మండలంలోని వెంకట్రావ్ పేట గ్రామానికి చెందిన మండల మాజీ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్ ను మంచిర్యాల జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ గా నియమించారు. ఎమ్మెల్యే నివాసంలో అంకతి శ్రీనివాస్ ను శాలువాతో సన్మానించి నియమక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంకతి శ్రీనివాస్ మాట్లాడుతూ... తనను నమ్మి తనకు ఈ పదవి కట్టబెట్టిన ఎమ్మెల్యేకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్న అలాగే వారు చేసే సేవ కార్యక్రమాలన్న చాలా అభిమానమని అన్నారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం దేనికైనా వెనుకాడడని, అలాగే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు ఏదో విధంగా తగిన గుర్తింపుతో పాటు తన వంతు సహాయ సహకారాలు అందజేసే గుణం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుదని చేసిన సేవలను కొనియాడారు.