08-04-2025 04:42:45 PM
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఆంజనేయ స్వామి దీక్షాపరులు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారు. కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో ప్రధాన అర్చకుడు శిరీష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్ర విజయవంతం కావాలన్నారు. పాదయాత్రగా బయలుదేరిన వారిలో చిప్ప కిరణ్, సైదం అంజన్న, రాపర్తి ప్రశాంత్, నికురే లహన్చు, రాజేశ్వర్, బుచ్చయ్య, సుధీర్, రమేష్, చిన్ను, రాజు ఉన్నారు.