20-04-2025 10:15:53 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కుమ్మరవాడ సెంటర్లో అంగన్వాడి టీచర్గా విధులు నిర్వహించే గన్నారపు సంధ్య (33) ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హుజురాబాద్ సిడిపిఓ మరాటి సుగుణ తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె తెలిపారు. మృతురాలికి భర్త రవి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.