calender_icon.png 23 October, 2024 | 3:01 PM

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

04-08-2024 03:51:09 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి, రేచిని మధ్య గల రైల్వే లైన్ పై శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని గూడ్స్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. 30 సంవత్సరాల వయసు గల మృతుడు పూలరంగచొక్క, తెల్లని ప్యాంటు ధరించి ఉన్నాడు. మంచిర్యాల రైల్వే ఎస్సై కేంసారం సంపత్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చూరీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు 8328512176, 9490871874 నెంబర్లలో సంప్రదించాలని రైల్వే ఎస్సై కోరారు.