calender_icon.png 26 October, 2024 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా కెరీర్‌లో మరువలేని సందర్భం

16-07-2024 12:10:00 AM

‘సారంగదరియా’ సక్సెస్ మీట్‌లో నటుడు రాజారవీంద్ర 

రాజారవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్‌ను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు రాజారవీంద్ర మాట్లాడుతూ.. “సారంగదరియా’కు మంచి సపోర్ట్ లభించింది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలో మోయిన్, మోహిత్, యశస్విని నా కంటే చాలా బాగా నటించారు. అందరి పాత్రలకు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇదే నాకు సంతోషకరమైన సందర్భం ఇది.. నా కెరీర్‌లో మరువలేని అనుభూతి లభించింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు. నిర్మాత శరత్ మాట్లాడుతూ.. ‘సారంగదరియా’ విడుదలైన అన్ని థియేటర్లలో బాగా ఆడుతోంది. మంచి కథతో సినిమా తీసిన నాకు ఇంతటి ఆదరణ లభిస్తుండటం చూస్తుంటే సంతోషంగా ఉంది’ అని తెలిపారు. దర్శకుడు పద్మారావు మాట్లాడుతూ.. ‘సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాను. కెమెరా డిపార్ట్‌మెంట్‌లో ముందుగా పనిచేశాను. చివరకు రాజా సర్ వద్దకు చేరాను. కథ చెప్పగానే ఆయన ఓకే చెప్పారు.. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన శరత్ గారికి థ్యాంక్స్’ అన్నారు.