మలయాళ స్టార్ దుల్కర్ సల్మా న్ తదుపరి చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం’గా ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సినిమా ఇది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సోమవారం ట్రైలర్ను విడుదల చేసింది.
హైదరాబాద్లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “14 నెలల తర్వాత నా నుంచి వస్తున్న ‘లక్కీ భాస్కర్’ నాకు చాలా ప్రత్యేకం” అన్నారు. ‘ఇప్పటివరకు నేను చేసినవాటిల్లో సుమతి పాత్ర నాకు బాగా ఇష్టమైంది.
ఇది నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం’ అని కథానాయిక మీనాక్షి చౌదరి అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘బ్యాంకింగ్ నేపథ్యంలో కుటుంబం భావోద్వేగాలతో నడిచే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’ అని తెలిపారు.