న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: యూపీ రాజధాని లక్నోలో గోమతినగర్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూర్చున్న చోటే కుప్పకూలి మృతిచెందింది. సాదఫ్ ఫాతీమా (45) గోమతినగర్ ప్రాంతంలోని విభూతిఖండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో అడిషనల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు.
రోజూలాగే డ్యూటీకి వెళ్లిన ఫాతీమా తాను పనిచేస్తున్న డెస్క్లో ఉన్నచోటే కుప్పకూలింది. గమనించిన తోటి ఉద్యోగులు ఆమె ను వెంటనే హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ఇటీవల డిప్యూ టీ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నుంచి ఆమెపై పనిఒత్తిడి బాగా పెరిగిందని ఈ కారణంగానే గుండెనొప్పి వచ్చి ఉండొచ్చని సహోద్యోగు లు చెబుతున్నారు.
ఫాతిమా అనుమానాస్పద మృతిపై విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ రాధారమణ్ సింగ్ స్పందిస్తూ ఫాతీమా డెడ్బాడీని పోస్ట్మార్టం కోసం పంపామని, రిపో ర్ట్ వచ్చిన తర్వాత ఆమె మృతికి కార ణం ఏంటనే విషయంలో స్పష్టత వస్తుందన్నారు.