calender_icon.png 23 September, 2024 | 12:49 PM

సత్రం భూమి ఆక్రమణకు యత్నం..

23-09-2024 12:16:55 AM

అడ్డుకొన్న ఆలయ ఈవో

భద్రాద్రి కొత్తగూడె, సెప్టెబంర్ 22(విజయక్రాంతి): భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని పాత బస్‌డిపో వెనుక ఉన్న చిట్టివారి సత్రం భూముల్లో ఆదివారం కొందరు నిర్మాణాలు చేపట్టారు. సమాచారం అందుకున్న గణేష్ ఆలయ ఈవో రజనీకుమారి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూముల్లోకి ప్రవేశించి నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.