న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: అమూల్ బ్రాండ్ పాల ఉత్పత్తులను విక్రయించే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అమ్మకాల టర్నోవర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వృద్ధితో రూ.59,445 కోట్లకు చేరింది.
తమ స్వర్ణోత్సవ సంవత్సరంలో రూ.59 వేల కోట్లకుపైగా టర్నోవర్ సాధించామని, గ్రూప్ టర్నోవర్ రూ. 80,000 కోట్లకు చేరిందని జీసీఎంఎంఎఫ్ 50వ వా ర్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించింది. తమది ప్రపంచంలోనే అతిపెద్ద రైతు సహకార పాడి సంస్థ అని, రోజుకు 300 లక్షల లీటర్ల పా లను సేకరిస్తున్నట్లు వెల్లడించింది.