హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): జలమండలి యానువల్ మెయింటెనెన్స్ సిస్టం (ఏఎంఎస్)ను కొనసాగించాలని ఏఎంఎస్ కాంట్రాక్ట్ అసోసియేషన్ నాయకులు బుధవారం జలమండలి ఎండీ అశోక్రెడ్డిని కోరారు. తాము ఎమర్జెన్సీ పనులు, ఎంసీసీ ఫిర్యాదుల పనులు చేస్తున్నామని తెలిపారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కానీ కొన్ని కాంట్రాక్టర్ల అసోసియేషన్లు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.