మొదలైన నీటి పంపింగ్
నిండనున్న ఏకేబీఆర్
డీ అందనున్న నీరు
నల్లగొండ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ మరమ్మతులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఏఎమ్మార్పీ మొదటి యూనిట్లో క్యాపిటల్ ఓరాయిలింగ్లో భాగంగా మోటార్ మరమ్మతులు చేపట్టారు. అనుకోకుండా భారీ వర్షాలు కురవడంతో సాగర్కు వరద పోటెత్తడంతో నాలుగో మోటార్ మరమ్మతు సాధ్యపడలేదు.
దీంతో డీ కి సాగునీరు అందకుండా పోయింది. రైతులు గగ్గోలు పెట్టడంతో తీవ్రంగా పరిగణించిన మంత్రులు యుద్ధ ప్రాతిపదికన మోటార్ మరమ్మతు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జెన్కో సిబ్బంది ఈ నెల 24 రాత్రి మరమ్మతులు పూర్తి చేశారు.
బుధవారం మోటార్ ఆన్ చేసి పూర్తిస్థాయిలో నీటి పంపింగ్ ప్రారంభించారు. దీంతో వానాకాలం సాగు ముగిసే సమయానికి ఏకేబీఆర్ పూర్తిస్థాయిలో నిండనుంది. డిస్ట్రిబ్యూటర్.7బీకి సైతం సాగునీరందనుంది.