calender_icon.png 8 October, 2024 | 10:23 PM

అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనం

08-10-2024 06:07:58 PM

కుంకుమ పూజలు నిర్వహించిన భక్తులు...

హుజురాబాద్, (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఇందిరా మార్గంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  దుర్గామాత మండపం వద్ద ఆరవ రోజు అమ్మవారు భక్తులకి అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళవారం రోజున మహిళలు భక్తి శ్రద్ధలతోని కుంకుమ పూజ ఘనంగా నిర్వహించి, మూల రామచందర్, సుగుణ దంపతులు మహానదన కార్యక్రమం నిర్వహించారు.  భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, సకల జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించాలని అన్నపూర్ణా దేవిని వేడుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నల్ల సుమన్, వినయ్, వంశీ తో పాటు భక్తులు పాల్గొన్నారు.