calender_icon.png 30 September, 2024 | 4:08 PM

ఖర్గే కాంగ్రెస్‌ను మించిపోయారు: అమిత్ షా

30-09-2024 01:48:53 PM

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంలో నాయకులను, కాంగ్రెస్ పార్టీని మించిపోయారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా సోమవారం ఎదురుదాడికి దిగారు. ఖర్గే మాటలు విద్వేషపూరితంగా ఉన్నాయని ఆరోపించారు. వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోకి ఖర్గే అనవసరంగా మోడీని లాగారని అమిత్ షా మండిపడ్డారు. ఆదివారం జస్రోటాలో జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీని అధికారం నుంచి తప్పించే వరకు తాను చనిపోనని అన్నారు. ర్యాలీలో ప్రసంగిస్తూ అస్వస్థతకు గురైన ఖర్గే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కాంగ్రెస్‌కు ప్రధాని మోడీ పట్ల ఎంత ద్వేషం, భయం ఉందో ఖర్గే వ్యాఖ్య ద్వారా అర్థమవుతోందని అమిత్ షా పేర్కొన్నారు.