07-03-2025 12:00:00 AM
కడ్తాల్, మార్చి 6 ( విజయ క్రాంతి ) : రాష్టంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడం పట్ల గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భగీరథ్, రెడ్యా నాయక్, శ్రీశైలం, శంకర్ నాయక్, సాయి లాల్, మాన్య నాయక్, వెంకటేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.