14-04-2025 09:32:16 PM
గజ్వేల్: మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని సోమవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులతో పాటు సిఐ సైదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన బాటలో ప్రజలంతా నడవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు ముత్యాలు కనకయ్య, సాగర్, మహేందర్ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.