calender_icon.png 20 September, 2024 | 2:47 AM

అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి

19-09-2024 06:26:50 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగపల్లి సాయిలు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని అన్నారు. అంబేద్కర్ ఒక కులానికి, మతానికి కాదని సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం పని చేసిన గొప్ప నాయకుడు అని విగ్రహాన్ని కూల్చితే రెట్టింపు స్థాయిలో ఆయన భావాజాలం ప్రజల్లోకి వెళ్తుందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావడం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జోగు నర్సింలు, ప్రశాంత్, యేసు తదితరులు పాల్గొన్నారు.