14-04-2025 05:04:57 PM
కోదాడ: పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు అధ్యక్షులు గడ్డం చిరంజీవి, కార్యదర్శి పద్మ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, సత్యనారాయణ, విక్రమ్, పులి శ్రీను, మహేష్, అక్షయ్, సరిత, గీత, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.