- 25 మంది జేబుల్లోకి దేశ సంపద
- హర్యానా ఎన్నికల ప్రచారంలో రాహుల్గాంధీ
చండీగఢ్, అక్టోబర్ 1: దేశంలో రైతులు, సామాన్యులు తమ పిల్ల ల పెండ్లిళ్ల కోసం అప్పులు చేస్తుం టే.. అంబానీలు తమ పిల్లల పెండ్లిళ్ల కోసం విచ్చలవిడిగా వేలకోట్లు ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శించారు. దేశ ప్రజల సొమ్మంతా ప్రధాని నరేంద్రమోదీ తనకు కావాల్సిన 25 మంది వ్యక్తుల జేబుల్లోకి పంపటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో మంగళవారం సోనిపట్ సభలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రద్దుచేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. దానిని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతున్నదని పేర్కొన్నారు.