ఏఐ ఆధారిత డాటా సెంటర్పై చర్చలు
అమెరికా పర్యటనలో కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయ క్రాంతి) : అమెజాన్ కంపెనీ హైదరాబాద్లో తన డాటా సెంటర్ను విస్తరించేం దుకు అవసరమైన పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపె నీ ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డాటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు.
ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అళమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్లో ఉంది. గతేడాది అమెజాన్ డెడికేటెడ్ ఎయిర్ కార్డో నెట్వర్క్ ‘అమెజాన్ ఎయిర్’ ప్రారంభించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్కు సంబంధిం చి హైదరాబాద్లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డాటా సెంటర్తోపాటు తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను ఈసందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ మాట్లాడుతూ... హైదరాబాద్లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందన్నారు.