29-03-2025 08:59:19 PM
కార్వాన్ (విజయక్రాంతి): అమావాస్యను పురస్కరించుకొని ప్రఖ్యాత గోల్కొండ కోటలో ఎండోమెంట్ అధికారి వసంత ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజారి సురేష్ చారి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో వసంత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివ చారి, ప్రసాద్, నవీన్, శివరాజ్, కిట్టు, సర్వేష్ చారి, రాములు తదితరులు పాల్గొన్నారు.