24-02-2025 12:00:00 AM
(ఎ.ఐ.ఎస్.బి) జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్
బాన్సువాడ, ఫిబ్రవరి 23( విజయ క్రాంతి):, శాస్త్రీయ విద్య కోసం ఎల్లప్పుడూ ఉద్యమాలు తప్పవని ఉమ్మడి జిల్లా ఏఐఎస్బి అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నిఝజామాబాద్ జిల్లా & కామారెడ్డి విద్యార్థుల శాస్త్రీయ విద్యాకోసం ఎల్లపుడు ఉద్యమాలు చేస్తామని (ఎ . ఐ ఎస్.బి)ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు.
విద్యారంగంలో వస్తున్న మార్పులనూ విద్యార్థులు గమనించాలని, శాస్త్రీయ విద్యాను సక్రమంగా అందిచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని ఆయన అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో కానీ సంక్షేమ హాస్టలల్లో కానీ కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పటించుకోవడం లేదని మరియు పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థులకూ విద్యాను దూరం చేయాలనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తుందని ఆయన పేర్కొన్నారు.విద్యార్థుల సమస్యలపై మా (ఎ.ఐ ఎస్ బి.) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఎల్లపుడు అలుపెరగని పోరాటాలు చేస్తుందని ఆయన అన్నారు.