calender_icon.png 10 March, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్తారంలో పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

09-03-2025 10:02:23 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1999-2000 సంవత్సరం కు చెందిన పూర్వ విద్యార్ధులు ఆత్మీయ సమ్మేళనంలో ఒకరినొకరు కలుసుకొని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంపత్, శ్రీధరచారి, శంకరయ్య, అశోక్ రెడ్డి, రవిందర్ రావు, దర్మలత, వాణిశ్రీ, విద్యార్థులు రాగుల సతీష్, మెట్టు తిరుపతి, తూముల రాజయ్య, బొడ్డు పల్లి సంజీవ్, ఈద మల్లేశ్వరి, గిరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.