22-12-2024 01:20:00 AM
కాళోజీ వర్సిటీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాం తి): ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫీజు కట్టలేక గత పరీక్షలకు హాజరుకాలేకపోయిన అర్షియా ఫాతిమా (పిటిషనర్)ను 2025 జనవరిలో జరిగే బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించాలని కాళోజీ వర్సిటీ ని హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని సూచించింది.
మాజీ సైనికుడి కూతురై న ఫాతిమా 2016లో నిజామాబాద్లోని మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్లో బీడీఎస్లో చేరారు. 2017, 2018లో పరీక్షలకు హాజరయ్యారు. 2020లో మూడో ఏడాది పూర్తిచేశారు. 2021 నుంచి ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగో ఏడాది పరీక్ష ఫీజు కట్టలేక హాజరుకాలేదు. 2024లో బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఫాతిమా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు.
అక్టోబర్ 28న వర్సిటీ ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. తనను చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించపోవడాన్ని సవాల్ చేస్తూ ఫాతిమా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్రావు ధర్మాసనం విచారణ చేపట్టిం ది. ఈ ఒక్కసారికి అనుమతించాలని వర్సిటీని ఆదేశిస్తూ, విచారణ ముగించింది.