హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు కురిపించారు. చీకటి ఒప్పందాలు, జీవోలతో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. 7 నెలల పాలనలోని చీకటి జీవోలపై ఈడీ, సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ నిధులలో భారీ అవినీతి జరిగిందని ఏలేటి పేర్కొన్నారు. అమృత్ పథకంలోని పనులను సీఎం కుటుంబ సభ్యులకు కేటాయించారని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇక్కడ డబ్బులు సమకూరుస్తున్నారని వెల్లడించారు.