calender_icon.png 7 October, 2024 | 7:13 PM

రైతుల రుణమాఫీపై బహిరంగ చర్చకు సీఎం సిద్దమా..?

07-10-2024 04:38:44 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో అవాస్తవాలు ప్రస్తావించారని బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు లేఖ రాశారన్నారు. చేతనైతే రైతు రుణమాఫీకి సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, రైతుల రుణమాఫీపై బహిరంగ చర్చకు సీఎం సిద్దమా..? అని ఏలేటి సవాలు విసిరారు. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ రాశారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.