calender_icon.png 4 February, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామోజీ ఫిలింసిటీలో పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి

04-02-2025 12:30:16 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రామోజీఫిలిం సిటీలో పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఇబ్రహీంపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఇంటి స్థలాల పట్టాలు ఉన్న లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా పగడాల యాదయ్య మాట్లాడుతూ.. 2007 సంవత్సరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటి స్థలం లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇవ్వాలని పోరాటం చేసిన ఫలితంగా 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 189లో 12ఎకరాలు, 203లో 8ఎకరాల 4గుంటల భూమిని నాగన్ పల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకునూర్ గ్రామాలకు చెందిన 675 మంది పేదలకు 60 గజాల చొప్పున ఇంటి స్థలం పట్టాలు ఇచ్చారని అన్నారు.

దీనికి లేఅవుట్ నక్ష ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తామని నమ్మించి కొంతమంది లబ్ధిదారుల నుంచి ఇంటి పట్టాలను కూడా తీసుకున్నారని తెలిపారు. నిరుపేదలైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వమే ఐదు లక్షల రూపాయల నిధులను ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్, కే జగన్, మండల కార్యదర్శి సిహెచ్.బుగ్గరాములు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్.జంగయ్య, పి.జగన్, మండల కమిటీ సభ్యులు సిహెచ్.నరసింహ,  ఎం.ఆనంద్, ఎ.నరసింహ తదితరులు పాల్గొన్నారు.