హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి
విచారణ 21కి వాయిదా
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): చందాదారులకు చెల్లింపులు చేపట్టా మంటూ సుప్రీంకోర్టుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ 69,531 పేజీలతో అందజేసిన వివ రాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని తెలంగాణ హైకోర్టుకు ఏపీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు.
కోరిన వివరాలు పుస్తకరూపంలో కాకపోయినా పెన్డ్రైవ్లో ఇచ్చినా అక్రమాలను వివరించగలనని చెప్పారు ఆగస్టు 30న అఫిడవిట్ దాఖలు చేసినా ఇప్పటివరకు వివరాలు అందజేయలేదన్నారు. అఫిడవిట్ని పరిశీలించిన వివరాలు అందేలా చర్యలు తీసుకో వాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యా దును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి, గత ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి.
అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును 2024, ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబట్టింది.
డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాలని, ఉండ వల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. దీంతో తెలంగాణ హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.
అక్రమాలేంటో చూపిస్తా..
‘నాకు వివరాలు ఇవ్వాలని ఆగస్టు 30న అఫిడవిట్ దాఖలు చేశా. బుక్ రూపంలో ఇవ్వలేకుంటే పెన్డ్రైవ్లో ఇవ్వమని కోరా. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ వివరాలు ఇస్తే.. అక్రమాలేంటో మీ ముందు ఉంచుతా. అలాగే చందాల వసూలు అంతా అక్రమమే అని ఆర్బీఐ తేల్చిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మార్గదర్శి చందాల వసూలంతా చట్టవిరుద్ధం, అక్రమేనని..
బాధ్యలను ప్రాసిక్యూట్ చేయాలని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాజ్లిస్ట్(కోర్టు విచారణ పిటిషన్ల జాబితా)లో నా పేరు ప్రచు రించేలా రిజిస్ట్రీని ఆదేశించండి’ అని ఉండవల్లి కోరారు. అనంతరం అరుణ్కుమార్ పేరు కాజ్లిస్ట్లో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఆయన అఫిడవిట్ను పరిశీలించి, సమాచారం అందేలా చూడాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
పేరుంటే ఊరు లేదు.. ఊరుంటే పేరు లేదు!
విచారణ వర్చువల్గా హాజరైన ఉండవల్లి అరుణ్కుమార్ వాదిస్తూ.. ‘రిజిస్ట్రీ ప్రచురించిన నోటీసులను చందాదారులు చూసే అవకాశం తక్కువ. సుప్రీంకోర్టుకు మార్గదర్శి 69,531 పేజీల వివరాలు అందజేసింది. సుప్రీంకోర్టుకు ఇచ్చినదంతా తప్పుడు సమాచారమే. చాలా మందికి ఇంటిపేర్లు లేవు. ఇంటిపేర్లు ఉన్న వారి అడ్రస్లు లేవు. కొందరికి నాలుగైదు అడ్రస్లు చూపించారు.
చందాలు తిరిగి ఎవరికి ఇచ్చారో, ఇవ్వలేదో సరిగా వివరాలు లేవు. జ్యోతిరావు అనే వ్యక్తి రూ.35 లక్షలకుపైగా కట్టారు. ఆయన అడ్రస్కు సంబంధించి వివరాలు సరిగా లేవు. రిజిస్ట్రీ ప్రచురించిన పబ్లిక్ నోటీసు బాధితులు చూసే అవకాశం తక్కువ. కోర్టు నేరుగా తెలుసుకునేందుకు చాన్స్ లేదు. అందుకే సుప్రీంకోర్టు నన్ను విచారణలో హైకోర్టుకు సహాయకుడిగా ఉండమని కోరింది’ అని పేర్కొన్నారు.