14-02-2025 12:00:00 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి 13: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము కరీంనగర్ లో గురువారం రోజున ఎంపీటీసీ/జడ్పీటీసీ స్థానిక సంస్థల ఏన్నికలు 2025 భాగంగా డ్రాప్ట్ పోలింగ్ స్టేషన్ ల పై అన్ని పోలిటికల్ పార్టిలతో సమావేశము నిర్విహించడం జరిగింది. జెడ్పి సి ఈ ఓ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశములో కాంగ్రెస్ పార్టీ నుండి ఎస్ కె సిరాజ్ హుస్సేన్, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, బిఆర్ఎస్ నుండి సాతినేని శ్రీనివాస్, సిపిఐ (ఎమ్)పార్టీ నుండి మిల్కురి వాసుదేవ రెడ్డి, సీపీఐ పార్టీ నుండి కె. సురేందర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుండి కల్యడపు ఆగయ్య మరియు ఎఐఎమ్ఐఎమ్ పార్టీ నుండి సయ్యద్ బర్కత్ పాల్గోన్నారు.