కోదాడ,(విజయక్రాంతి): పట్టణానికి చెందిన శ్యామల నర్సింగ్ హోమ్ డాక్టర్ బి సైదా, శ్యామల దంపతుల కుమార్తె బి మనస్విని ఆల్ ఇండియా నీట్ ఎగ్జాంలో మంచి ర్యాంకు సాధించి ఈరోజు హైదరాబాదులోని ఉస్మానియా గవర్నమెంట్ కాలేజీలో ఎంబిబిఎస్ సీట్ సాధించిన సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో ఆర్ఎంపీల ఆధ్వర్యంలో మరియు హాస్పటల్ సిబ్బంది అందరూ కలిసి ఘన సన్మానం చేయడమైనది ఈ సందర్భంగా ఆలిండియా కేటగిరిలో 736 ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీట్లు సాధించిన మనస్విని కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు అందరూ శుభాకాంక్షలు తెలియజేయునైనది