calender_icon.png 28 September, 2024 | 2:56 AM

రైతులందరికీ రుణమాఫీ చేయాలి

28-09-2024 12:35:29 AM

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే  చిరుమర్తి లింగయ్య

నల్లగొండ, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. నార్కెట్‌పల్లి మండల కేంద్రంలో రైతులు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ అమలులో కొర్రీలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసగిస్తున్నదని ఆక్షేపించారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూ పు చేస్తున్నదని మండిపడ్డారు. పూర్తిస్థాయి రుణమాఫీ చేసేంత వరకు ప్ర భుత్వాన్ని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ఆరు గ్యార ంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని ఆరోపించారు.