calender_icon.png 27 September, 2024 | 9:02 PM

రైతులందరికీ రుణమాఫీ చేయాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

27-09-2024 06:06:38 PM

నకిరేకల్,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని మండి పడ్డారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని,  చేసేదాకా ప్రభుత్వాన్ని వదలమని హెచ్చరించారు.