- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్
- పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట అందోళన
పెద్దపల్లి, అక్టోబర్ 1 (విజయక్రాంతి): రూణమాఫీ కాని రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని, లేదంటే రైతులతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట అందోళన చేశా రు.
అనంతరం అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రూణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.
రుణమాఫీ చేసేదాక పోరాటం చేస్తామని హెచ్చ రించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మరోహర్రెడ్డి, పుట్ట మధు, నాయకు లు రాఘువీరసింగ్, గంట రాములు యాద వ్, దాసరి ఉష, రైతులు, పాల్గొన్నారు.