భైంసా, 19: నియోజవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని మండలాలు తనకు సమానమని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ అన్నారు. భైంసాలో శనివారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీము బార్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నియోజకవర్గంలో కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభవృద్ధికి పాటుపడతాన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన ఎజెండా అన్నారు. కార్యక్రమంలో బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.