calender_icon.png 21 October, 2024 | 2:44 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధం

21-10-2024 12:45:17 PM

హైదరాబాద్: ఎన్నో ఆందోళనలు, నిరసనల తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ వన్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 1.30 వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఏదైనా ఫొటో గుర్తింపు పత్రం తేవాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గ్రూప్ -1 మెయిన్స్ కోసం మొత్తం 46 పరీక్ష కేంద్రాలను  ఏర్పాటు చేశారు. 31,383 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ రాస్తున్నారు. అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 563 గ్రూప్-1 పోస్టులకు ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.  పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితులను కలెక్టర్లు, పోలీసులు అధికారులు పరిశీలించారు. గండిపేట ఎంజీఐటీ కళాశాలలో కలెక్టర్ శశాంక ఏర్పాట్లను పరిశీలించారు. రామంతాపూర్ లోని స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో సీపీ సుధీర్ బాబు ఏర్పాట్లను పరిశీలించారు.