కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ రేకుర్తి లో శ్రీ నవదుర్గ సేవ సమితి కాళోజీ నగర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి శరన్నవ రాత్రోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు అన్నపూర్ణ దేవి అవతారంలో ఉన్న అమ్మ వారిని ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు .నవదుర్గ సేవా సమితి యూత్ సభ్యులు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, కాలనీ వాసులు పాల్గొన్నారు.