01-04-2025 02:25:34 AM
ప్రశాంతంగా రంజాన్ వేడుక : జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్ మార్చి 31 (విజయ క్రాంతి) : ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ రంజాన్ వేడుకలకు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను జిల్లా ఎస్పీడీ జానకి సూచించారు. సోమవారం రంజాన్ వేడుకను పురస్కరించుకొని పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రంజాన్ వేడుకలకు అవసరమైన చర్యలు ప్రత్యేకంగా తీసుకున్నమని తెలిపారు. రంజాన్ పండుగ జిల్లా వ్యాప్తంగా సంతోషంగా జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు ఉన్నారు.