calender_icon.png 13 October, 2024 | 11:32 PM

రెండు రోజుల్లో రూ.352 కోట్లు

13-10-2024 09:53:55 PM

దసరా పండగతో జోరుగా మద్యం అమ్మకాలు

 ఈనెలలో ఇప్పటికే రూ.852.40 కోట్ల సెల్లింగ్

హైదరాబాద్,(విజయక్రాంతి): దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. పల్లె, పట్నం తేడా లేకుండా మద్యం ప్రియులు ఫుల్లుగా తాగేశారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు, 10న రూ.152 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 1 నుంచి 10 వరకు రూ.852.40 కోట్ల విలువైన మందు అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దీంతో ఎక్సైజ్ శాఖకు గతనెల కంటే అధిక ఆదాయం వచ్చింది. రంగారెడ్డి, హైదరాబాద్‌లో అధికంగా ఉన్నాయి.