calender_icon.png 22 September, 2024 | 3:48 PM

ప్రాణం తీసిన మద్యం మత్తు

20-09-2024 12:03:18 AM

కుమారుడు తోసేయడంతో కిందపడి గాయాలపాలై తల్లి మృతి

వికారాబాద్ రూరల్/పరిగి, సెప్టెంబర్ 19: మద్యం మత్తులో కన్నతల్లి ప్రాణాలను బలిగొన్నాడు ఓ కుమారుడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వెంకటయ్య, శ్రీనివాస్ గురు వారం మద్యం తాగుతూ డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. అయితే, ఇద్దరు అన్నదమ్ముళ్లు గొడవపడి కొట్టుకుంటుండ గా తల్లి శంకరమ్మ సముదాయించే ప్రయత్నం చేసింది. దీంతో చిన్న కుమారుడు శ్రీనివాస్ తల్లిని తోయ గా, ఆమె సీసీ రోడ్డుపై పడింది. తలకు తీవ్రగాయమై అక్కడిక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శంకరమ్మను మద్యం మత్తులో తోసినట్లు కుమారుడు ఒప్పుకున్నాడు.