బీజింగ్: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ సెమీస్కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో అల్క రాజ్ (స్పెయిన్) 7-5, 6-2తో కచనోవ్ (రష్యా)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకున్నాడు. సెమీస్లో అల్కరాజ్ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్తో అమీతుమీకి సిద్ధమయ్యాడు.
మిగిలిన క్వార్టర్స్లో నంబర్వన్ సిన్నర్ (ఇటలీ) 6-2, 7-6 (7/6)తో లెహెకాపై, ఆండీ రుబ్లేవ్ 6-4, 7-5తో అలెజాండ్రో ఫొకినాపై, మెద్వెదెవ్ (రష్యా) కొబొల్లి పై విజయాలు సాధించారు. మహిళల సింగిల్స్లో రెండో ర్యాంకర్ సబలెంకా రెండో రౌండ్లో క్రూగర్ను ఓడించి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఆమెకు ఇది వరు సగా 14వ విజయం. మిగిలిన మ్యాచ్ల్లో విజయాలు సాధించిన మిర్రా ఆండ్రీవా, ఒసాకా, గాఫ్, మాడిసన్ కీస్, బడోసా, పెగులా ముందంజ వేశారు.